న్యూఢిల్లీ: తమ ఇండియా ప్లే స్టోర్ నుంచి జనవరి–జులై మధ్య కాలంలో మొత్తం 2 వేల పర్సనల్ లోన్ యాప్స్ను బ్లాక్చేసినట్లు గుగుల్ ప్రకటించింది. రూల్స్ను పాటించకపోవడం వల్లే ఈ యాప్స్ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. చాలా లోన్ యాప్స్ను తొలగించామని, ఇందులో 50 శాతం యాప్స్ రూల్స్ను పాటించడం లేదని గుగుల్ ఏషియా–పసిఫిక్ హెడ్ (ట్రస్ట్ అండ్ సేఫ్టీ) సైకత్ మిత్రా చెప్పారు. మోసపూరిత యాప్స్ను తొలగించడంలో గవర్నమెంట్ సహా అందరు స్టేక్హోల్డర్లతోనూ కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండోనేషియా దేశంలో యాప్స్ను ఏరివేయడం ఈజీ అని చెప్పారు.