మూకుమ్మడిగా బీఆర్ఎస్​లో చేరిన ముఖ్య నేతలు

మూకుమ్మడిగా బీఆర్ఎస్​లో చేరిన ముఖ్య నేతలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో కాంగ్రెస్​కు గట్టి షాక్ ​తగింది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం బీఆర్ఎస్​లో చేరారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్​సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీ సీనియర్​నేతలు తాండ్ర వెంకటరమణ, రేపాక పూర్ణచంద్రరావు, వెంకటరమణ, శ్రీనివాస్, మల్లేశ్,​ బ్లాక్​కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్​గౌడ్, భద్రాచలం టౌన్​మాజీ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాండ్ర నర్సింహారావు, బీసీ సెల్ డివిజన్​అధ్యక్షుడు హన్మంతరావు 

ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఉబ్బా వేణు, రమేశ్, ఎస్టీ సెల్​రాష్ట్ర కార్యదర్శి తెల్లం నరేశ్​తోపాటు జడ్పీటీసీ పుష్పలత, ఎంపీపీ శ్యామల, చర్ల ఎంపీపీ కోదండ రామయ్య, వాజేడు జడ్పీటీసీ వర్సా చిన్నారావు, కొత్తపల్లి సర్పంచ్​గుండి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజు, నడికుడి ఎంపీటీసీ సోడి తిరుపతిరావు, ప్రగళ్లపల్లి ఎంపీటీసీ మడకం రామారావు, వట్టిగూడెం సర్పంచ్​సరియం సీతారాములు, అంజుపాక సర్పంచ్ మడకం నాగేంద్ర తదితరులు బీఆర్ఎస్​లో చేరారు. మూకుమ్మడిగా ముఖ్య నేతలంతా పార్టీని వీడడంతో భద్రాద్రి కాంగ్రెస్​లో కలకలం రేగింది.

ALSO READ: విగ్రహాలు కొనివ్వడం మొదలు నిమజ్జనం దాకా దగ్గరుండి ఏర్పాట్లు

స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్యనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది పార్టీని వీడడంపై హైకమాండ్ ఆరా తీస్తోంది. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీతో ఇమడ లేకనే బ్లాక్​కాంగ్రెస్​అధ్యక్షులు రమేశ్​గౌడ్, బొలిశెట్టి రంగారావు, సీనియర్​లీడర్లు తాండ్ర వెంకటరమణ, నర్సింహారావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పార్టీ మారినట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

దీనికితోడు దుమ్ముగూడెంకు చెందిన తెల్లం నరేశ్, వేణును ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించి సస్పెండ్​చేశారు. ఈ పరిణామం కూడా పార్టీని దెబ్బ తీసినట్లయింది. మండలంలో వీరిద్దరికి పట్టు ఉంది. గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బాగా కష్టపడ్డారు. వీరు కూడా గులాబీ జెండాను కప్పుకున్నారు.