అనుమానాస్పదంగా కేటీపీఎస్ ఉద్యోగి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన

అనుమానాస్పదంగా కేటీపీఎస్ ఉద్యోగి మృతి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెంకు చెందిన కేటీపీఎస్  ఉద్యోగి మీసాల సునీల్ కుమార్(45) డెడ్​బాడీ అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీపీఎస్ లో ఉద్యోగం చేసే సునీల్ కుమార్  మూడు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పాటు ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు తలుపులు తీసి చూడగా సునీల్  కుమార్  డెడ్​బాడీ బెడ్రూమ్ లో కుళ్లిపోయి కనిపించింది. డెడ్​బాడీని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్  ఎస్సై టి నాగరాజు తెలిపారు.