
భద్రాచలం, వెలుగు: కొవిడ్ కారణంగా భద్రాద్రి రాముడి తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం భక్తులు లేకుండా నిర్వహించనున్నారు. అయితే 13న స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఆన్లైన్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. రూ.2 వేల టికెట్ బుక్ చేసుకుంటే పూజలు చేసి స్వామి వారి శాలువా, కుంకుమ, తలంబ్రాలు, ప్రసాదాన్ని కొరియర్ చేస్తారు. రూ.వెయ్యి టికెట్ బుక్చేసుకుంటే పూజలు చేసి స్వామి వారి కల్యాణ కండువా, కుంకుమ, తలంబ్రాలు, ప్రసాదం పంపుతారు. www.bhadrachalamonline.com లో బుక్ చేసుకోవాలని ఈఓ శివాజీ సూచించారు.