ఆస్పిరేషన్ జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్లో భద్రాద్రి

ఆస్పిరేషన్ జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్లో భద్రాద్రి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆస్పిరేషన్​ జిల్లా నుంచి దేశానికే ఇన్సిపిరేషన్​  అందించే జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​ వీ పాటిల్​ సూచించారు. కలెక్టరేట్​లో మంగళవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్​ సమ్మాన్​ సమారోహ్​ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆస్పిరేషన్​ జిల్లాగా  రాష్ట్ర స్థాయిలో  అగ్రస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ కలిసి ​వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆస్పిరేషనల్​ డిస్ట్రిక్ట్​ ప్రోగ్రాం ద్వారా జిల్లాలో అనేక రంగాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఉద్యోగి సమర్థవంతంగా పనిచేయడంతోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 

జిల్లా వ్యాప్తంగా ప్రతీ అంగన్​వాడీ సెంటర్, స్కూల్​లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామ నితెలిపారు. ఆకాంక్షిత అభివృద్ధి లక్ష్యాల్లో విశేష కృషి చేసిన పలువురు జిల్లా అధికారులతో పాటు మొత్తం 133 మందికి మెడల్స్​, ప్రశంసా పత్రాలను కలెక్టర్​ అందజేశారు. 

నులిపురుగుల దినోత్సవాన్ని సకెస్స్​ చేయాలి

ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని సక్సెస్​ చేయాలని కలెక్టర్​ జితేశ్​పిలుపునిచ్చారు. కలెక్టరేట్​లో ఆయన మాట్లాడుతూ ఏడాది నుంచి 19 ఏండ్ల వయసు గల వారందరికీ నులి పురుగులను నివారించే అల్బెండజోల్​ మాత్రలను వేయనున్నట్టు తెలిపారు. 

ఈ మాత్రలు వేసుకోవడం వల్ల స్టూడెంట్స్​ ఆరోగ్యంగా ఉంటారని, ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. 11న మాత్రలు వేసుకోని వారికి 18న వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో జయలక్ష్మి, సీపీఓ సంజీవరావు, ఐసీడీఎస్​ పీడీ స్వర్ణలత లెనినా, డాకర్లు తేజశ్రీ, స్పందన, మధురం, భూపాల్​రెడ్డి, డిప్యూటీ డెమో ఫయాజుద్దీన్​ పాల్గొన్నారు.