V6 News

భద్రకాళి అమ్మవారి బ్రహోత్సవాలు షురూ

భద్రకాళి అమ్మవారి బ్రహోత్సవాలు షురూ

కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వరంగల్  పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నుంచి గురువారం వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఉమ్మడి వరంగల్​ జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో మాజీ స్పీకర్​ సిరికొండ మధుసూదనా చారి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్​ గౌరీశంకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మదన్మోహన్​ అమ్మవారికి పట్టు చీరలు, పూజాద్రవ్యాలు సమర్పించారు.