కోట్లాది మందికి మేలు: మలేరియా వ్యాక్సిన్ ధర తగ్గింపుపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

కోట్లాది మందికి మేలు: మలేరియా వ్యాక్సిన్ ధర తగ్గింపుపై భారత్ బయోటెక్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: జీఎస్​కే, పాత్, ఇతర కంపెనీలు అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ 'ఆర్టీఎస్, ఎస్' ధరను 2028 నాటికి సగానికి పైగా తగ్గిస్తామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జీఎస్​కే బుధవారం తెలిపాయి. ధర ఐదు డాలర్ల కంటే తక్కువగా ఉండేలా చూస్తామని తెలిపాయి. దీనివల్ల లక్షలాది మందికి మేలు జరుగుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్​) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. 

జీఎస్​కే చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ మాట్లాడుతూ, మలేరియాను నియంత్రించాలన్న ఉమ్మడి లక్ష్యంతో తమ కంపెనీ 2021లో భారత్ బయోటెక్‌‌‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని అన్నారు.   2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) సిఫార్సు చేసిన మొదటి మలేరియా వ్యాక్సిన్ ఆర్టీఎస్, ఎస్. అప్పటి నుంచి టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి  భారీగా పెట్టుబడులు పెట్టామని, భారత్​బయోటెక్​కు టెక్నాలజీని బదిలీ చేశామని  జీఎస్​కే  వెల్లడించింది.