- బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్
- పొలిటికల్ సర్కిల్స్లో వైరల్
హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ ‘కర్మ హిట్స్బ్యాక్’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మరోవైపు కవిత పోస్టుపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువ మంది బీఆర్ఎస్కు తగిన శాస్తి జరిగిందంటూ కవితకు మద్దతుగా కామెంట్స్చేయగా.. కొందరు మాత్రం బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.
అప్పట్నుంచి దుమారం..
కవిత బీఆర్ఎస్ నుంచి దూరమై ఇప్పుడు సొంతంగా జాగృతి తరఫునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఏడాది మేలో ‘కేసీఆర్దేవుడు.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ‘‘కేటీఆర్, హరీశ్రావు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు, ఓడించేందుకు వెనుక నుంచి కుట్రలు పన్నారు” అని ఆరోపణలు చేశారు.
దీంతో కవితను పక్కనపెట్టి, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్కు చాన్స్ ఇచ్చారు. అది రాజకీయ కుట్రంటూ మరోసారి కవిత ఆరోపణలు చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీ అధినేత కేసీఆర్.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే రోజు తన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఆ వెంటనే హరీశ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్రబుల్షూటర్కాదు.. ట్రబుల్మేకర్ అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో అవలంబిస్తున్న విధానాల వల్లే బీఆర్ఎస్కు ఓటములు ఎదురవుతున్నాయని అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పార్టీకి పెనునష్టం తప్పదని హెచ్చరించారు. పదేండ్ల పాలనలోని బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్న కవిత.. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందిస్తూ కర్మ ఎవరినీ వదలదంటూ పోస్ట్పెట్టి మరో చర్చకు తెరలేపారు.
వాళ్ల పేర్లు బయటపెట్టినందుకే పార్టీ నుంచి బయటకు పంపారు
మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట, వెలుగు: ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం కోసం అవసరమైతే హైదరాబాద్లో పోరాటం చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం మెదక్ జిల్లాలో పర్యటించారు. నర్సాపూర్లోని స్కూల్లో చిల్ట్రన్స్డే వేడుకల్లో పాల్గొని, అనంతరం రెడ్డిపల్లిలో కాళేశ్వరం ప్యాకేజీ-18 పనులను పరిశీలించారు.
అక్కడ ట్రిపుల్ ఆర్లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. పెద్దల భూములు కాపాడేందుకే రెడ్డిపల్లి దగ్గర ట్రిపుల్ ఆర్అలైన్మెంట్మార్చారని కవిత ఆరోపించారు. మల్లన్నసాగర్భూనిర్వాసితులు ఈ ప్రాంతంలో భూములు కొనుక్కున్నారని, మళ్లీ వాళ్ల భూములు పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిపల్లి వద్ద ట్రిపుల్ ఆర్అలైన్మెంట్మార్పుపై స్పందిస్తూ.. ‘‘ఏ సర్వే నెంబర్లలో ఎవరి భూములు ఉన్నాయి.
ఏం జరిగిందనేది వెరిఫై చేసి శనివారం ప్రెస్మీట్లో చెబుతాను. నేను ఎవరి పేరైనా గట్టిగా, బాహాటంగా చెప్తాను. అలా చెప్పినందుకే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు” అని వ్యాఖ్యానించారు.
