త్వరలో 12 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్

త్వరలో 12 నుంచి 18 ఏళ్ల వారికి  వ్యాక్సిన్

దేశంలో 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారికి భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించింది. భారత్ బయోటెక్ చిన్నారులపై చేసిన  3 దశల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ. ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది.