స్థానిక ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు కూడా ఎన్​సీడీలను కొనే అవకాశాలు

స్థానిక ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు కూడా ఎన్​సీడీలను కొనే అవకాశాలు

న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ అమ్మబోయే మిగిలిన 3.33శాతం వాటా కొనడానికి  భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్  ప్రమోటర్ కంపెనీ భారతి టెలికాం (బీటీఎల్) నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్​సీడీలు) ద్వారా రూ.6,000 కోట్ల వరకు  సేకరించనుంది. ఇవి  రూపాయి- లింక్డ్ ఎన్​సీడీలని కంపెనీ వర్గాలు తెలిపాయి. వీటికి ప్రధానంగా ఫారిన్​ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పిఐలు) సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. కొంతమంది స్థానిక ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు కూడా ఎన్​సీడీలను కొనే అవకాశాలు ఉన్నాయి.  పోయినవారం  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌లో సింగ్​టెల్ 1.76శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా రూ.7,100 కోట్లకు అమ్మింది.

ఆ వాటాలో దాదాపు 1.62శాతం - బీటీఎల్ రూ.6,604 కోట్లకు కొన్నది. మిగిలిన (0.14శాతం) వాటా ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌లోని పబ్లిక్ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్లు తీసుకున్నారు. బీటీఎల్ ఇప్పుడు సింగ్‌‌‌‌‌‌‌‌టెల్ నుండి మిగిలిన వాటా కొనుగోలుకు డబ్బు వేటలో పడింది.  బీఎన్​పీ పరిబాస్​, హెచ్​ఎస్​బీసీ, జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎంయూఎఫ్​జీ  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు రూపాయి ఎన్​సీడీల ద్వారా డబ్బును సేకరించేందుకు బీటీఎల్​కు సహాయపడే అవకాశం ఉంది.