
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల ఆరో విడతలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం పంజాబ్ వెళ్లారు. ఆ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. దీంతో ఆయన బుధవారం నుంచి మూడు రోజుల పాటు అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్ఎస్యూఐ నేషనల్ ఇన్చార్జ్ కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్నారు.