బీఆర్ఎస్, బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీలు

బీఆర్ఎస్, బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీలు

హైదరాబాద్​, వెలుగు: కార్మికుల హక్కులను బీఆర్ఎస్​, బీజేపీ ప్రభుత్వాలు కాలరాస్తున్నా యని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సకల జనుల సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్​ సర్కారు.. తొమ్మిదన్నరేండ్లుగా కనీస వేతన బోర్డుపై సమీక్ష చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఆదివారం గాంధీభవన్​లోని ప్రకాశం హాల్​లో అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్​ (కేకేసీ– కామ్​గార్​, కర్మాచార్​ కాంగ్రెస్​) సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేకేసీ ఆలిండియా చైర్మన్​ డాక్టర్​ ఉదిత్​ రాజ్​ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా ఔట్​ సోర్సింగ్​ విధానంతో ప్రభుత్వం శ్రమదోపిడీకి పాల్పడుతున్నదని ఫైర్​ అయ్యారు.  కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్​ తెచ్చిన 10 వేల కోట్ల సెస్​ నిధులను పక్కదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. కౌశల్​ సమీర్​ కేకేసీ రాష్ట్ర చైర్మన్​గా ఎన్నికైన సందర్భంగా ఉదిత్​ రాజ్​, మాణిక్​ రావ్​ ఠాక్రే, షబ్బీర్  అలీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. మరోవైపు మీటింగ్​ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ కార్మిక సంఘం అనుబంధ విభాగం ఐఎన్​టీయూసీ నేతలు గొడవకు దిగారు.