కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్స్పై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా, మురళీ మోహన్ కెమెరా స్విచాన్ చేశారు.
ముప్పా వెంకయ్య చౌదరి దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. పవర్ఫుల్ స్ర్కిప్ట్, హై టెక్నికల్ వేల్యూస్తో దీన్ని రూపొందించనున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.