కరోనాతో బీహార్ సీఎస్ మృతి

కరోనాతో బీహార్ సీఎస్ మృతి

బిహార్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అరుణ్ కుమార్ సింగ్ చనిపోయారు. కరోనా కారణంగా పట్నాలోని పరాస్ HMRI హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. 1985 బ్యాచ్ బిహార్ కేడర్ IAS అధికారి అయిన అరుణ్ కుమార్ సింగ్... మార్చ్ 1న చీఫ్ సెక్రటరీగా ఛార్జ్ తీసుకున్నారు. ఆగస్ట్ లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. గత వారం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. పరిస్థితి సీరియస్ కావడంతో... పట్నాలోని పరాస్ Bu హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. CS మృతి పట్ల సీఎం నితీశ్ కుమార్ సంతాపం తెలిపారు.