
బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బీహార్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపుకు చేరుకున్నారు. బీహార్ కొత్త ఏర్పడిన ప్రభుత్వం ఫిబ్రవరి 12న జరిగే బలనిరూపణ పరీక్షముందు ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది.ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంపుకు తరలించినట్లు తెలుస్తోంది.
గతవారం అధికారాన్ని కోల్పోయిన మహాగట్ భంధన్ లో రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్..బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకు నేందుకు కాంగ్రెస్ ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ పంపింది. అయితే ఈ విషయంపై ఏఐసీసీ బీహార్ ఇంచార్జ్ మోహన్ ప్రకాష్ ను వివరణ అడగ్గా స్పష్టత ఇవ్వలేదు.
బీహార్ అసెంబ్లీలో మొత్తం 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. వారి లో 16 మందిని హైదరాబాద్ కు తరలించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లతో ఉన్న పరిచయాలను ఆసరాగా తమ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని బీహార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో బీజేపీ, జేడీయూ లకు పూర్తి మెజార్టీ ఉంది.
అయితే బీజేపీ కంటే జేడీయూ సంఖ్యాబలం చాలా తక్కువగా ఉండటం సీఎం నితీష్ కుమార్ కు కొంత చికాకు పెడుతున్న అంశం.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని.. బలనిరూపణ వరకు హైదరాబాద్ లోనే ఎమ్మెల్యేలను ఉంచనున్నట్లు తెలుస్తోంది.
అయితే బీహార్ రాష్ట్ర కాంగ్రస్ అధ్యక్షుడు అఖిలేస్ కుమార్ సింగ్ ఎమ్మెల్యేల తరలింపుపై స్పందిస్తూ.. తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించేందుకు మా ఎమ్మెల్యేలు వచ్చారు. వారు ఫిబ్రవర 11 వరకు అక్కడే ఉంటారు. జనవరి 28న బీహార్ జరిగిన తిరుగుబాటు తర్వాత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో కాలి కొత్ ప్రభుత్వాన్ని ఏర్పాుటు చేశారు. ఈ ప్రభుత్వం ఫిబ్రవరి 12న బీహార్ అసెంబ్లీలో మెజారీటీ నిరూపించుకోవాల్సి ఉంది.