ప్రశాంత్ కిషోర్ పార్టీకి స్కూల్ బ్యాగ్ గుర్తు

ప్రశాంత్ కిషోర్ పార్టీకి స్కూల్ బ్యాగ్ గుర్తు

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్  స్థాపించిన జన్ సూరజ్ పార్టీకి స్కూల్ బ్యాగ్ గుర్తును కేటాయించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్.  బీహార్‌లో 2025లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తు  స్కూల్ బ్యాగ్ ను కేటాయించింది. పార్టీలోని మొత్తం 243 మంది అభ్యర్థులు ఇప్పుడు ఈ కొత్త  సింబల్ పై  పోటీ చేయవచ్చు.  ఎన్నికల కమిషన్ నిర్ణయం పట్ల పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక విధానం, సమ్మిళిత అభివృద్ధి ద్వారా సంస్కరణ ,సామాజిక అభ్యున్నతిని తీసుకురావాలనే వారి లక్ష్యంతో ఈ చిహ్నం లోతుగా ప్రతిధ్వనిస్తుందని తెలిపారు.

►ALSO READ | హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్..ఆకస్మిక వరదలు..కులు జిల్లాలో తీవ్రనష్టం

అక్టోబర్ 2, 2024న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ జన్ సురాజ్ను ప్రకటించారు. 3 వేల కిలోమీటర్లు బీహార్ లో పాదయాత్ర చేసిన అనంతరం ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ వెనుకబాటుతనానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్లంతా కారణమేనని, తాను ఒక ప్రత్యామ్నయంగా బీహార్ను అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ సింబల్లో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోలను పొందుపరిచారు. బీహార్‎లోని 243 అసెంబ్లీ స్థానాల్లో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతానని .. 40 మంది మహిళలకు టికెట్లు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తామని ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటించారు.  బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు 2025 అక్టోబర్ లేదా నవంబర్‌లో జరగనున్నాయి.