బైక్ ర్యాలీలకు నో పర్మిషన్

బైక్ ర్యాలీలకు నో పర్మిషన్

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఎలక్షన్స్​ ప్రచారానికి హైదరాబాద్​లో బైక్ ర్యాలీలకు పర్మిషన్​లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్  లోకేష్​ కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా, సిటీ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ అరుణ్ జోషి ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్  మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిధిలో 191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో కౌంటింగ్​ కేంద్రం ఉంటుందని, కౌంటింగ్​కు దాదాపు 40 గంటలకుపైగా టైమ్​ పట్టే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.