హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారానికి హైదరాబాద్లో బైక్ ర్యాలీలకు పర్మిషన్లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా, సిటీ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ అరుణ్ జోషి ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిధిలో 191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం ఉంటుందని, కౌంటింగ్కు దాదాపు 40 గంటలకుపైగా టైమ్ పట్టే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.