9 జిల్లాలలోని ల్యాబుల్లో ఉత్పత్తి
హైదరాబాద్, వెలుగు: పంటలకు వాడే రసాయన మందుల వినియోగాన్ని తగ్గించేందుకు వ్యవసాయశాఖ బయో పెస్టిసైడ్స్ను అందుబాటులోకి తెచ్చింది. 9 జిల్లాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లలో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. షరతుల ఎవుసం అమలులో భాగంగా పత్తి, వరి, కంది పంటలకు
సోకే తెగుళ్లను నివారించే బయో పెస్టిసైడ్స్ను అందుబాటులోకి తెచ్చారు. ట్రైకోడెర్మవిరిడి, సూడోమోనాస్ ఫ్లోరొ సెన్స్ పెస్టిసైడ్స్ ను రైతులకు అందజేయనున్నట్లు అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ రాములు చెప్పారు. రాజేంద్రనగర్, మహబూబ్ నగర్, కరీంనగర్, సదాశివపేట, నిజామాబాద్,
ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ లోని ల్యాబ్లలో బయో పెస్టిసైడ్స్ లభిస్తాయన్నారు.
For More News..