
సంగారెడ్డి, వెలుగు: మొక్కజొన్న వ్యర్థాలకు ఉప్పు, చక్కెర, సల్ఫ్యూరిక్యాసిడ్కలిపి అతి తక్కువ ఖర్చుతో బయోడీజిల్తయారు చేసే కొత్త పద్ధతిని ఐఐటీ హైదరాబాద్రీసెర్చర్లు కనుగొన్నారు. ఈ ఇంధనాన్ని ఆటో మొబైల్, ఏవియేషన్ రంగాల్లో ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.2030 నాటికి కార్బన్డైయాక్సైడ్ ఉద్గారాలలో 3.5 శాతం, ప్రపంచ చమురు డిమాండ్లో 15 శాతం ఉన్న గ్లోబల్ ఏవియేషన్ రంగం 2050 సంవత్సరం వచ్చే నాటికి 50 శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుందని వారు చెప్పారు.
పర్యావరణ అనుకూలమైన బయోడీజిల్తో కార్బన్ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని, అందువల్ల భవిష్యత్లో మొక్కజొన్న రైతులకు స్థిరమైన లాభాలు ఉంటాయన్నారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్ దేశ్ పాండే, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సునీల్కుమార్, పరిశోధన విద్యార్థులు దామోదర్, అలేఖ్య, మోహన్ ల టీమ్ ఈ ఎక్స్పెరిమెంట్చేశారు. వీరిని ఐఐటీ హెచ్ డైరెక్టర్ యూబీ దేశాయ్ అభినందించారు.