
జీడిమెట్ల, వెలుగు: జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్టేట్చీఫ్ఇన్ఫర్మేషన్కమిషనర్జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. దూలపల్లిలోని ఇన్స్టిట్యూట్ఆఫ్ఫారెస్ట్ బయో డైవర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం చెట్ల పెంపకం మేళా జరిగింది. ఆయన హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలను, రైతులను ఒకే వేదిక పైకి తెచ్చి చెట్ల పెంపకం మేళా నిర్వహించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో ఐసీఎఫ్ఆర్సీ -ఐఎఫ్బీ డైరక్టర్ ఈ.వెంకట్రెడ్డి, డాక్టర్ సుధీర్కుమార్, డాక్టర్ పట్నాయక్, సందీప్, దాక్టర్ పంకజ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.