హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 27 అర్బన్ లోకల్ బాడీల విలీనంతో పాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి, జోన్లను 6 నుంచి 12కి పెంచిన నేపథ్యంలో జనన – మరణాల నమోదు, జారీ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దారు.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలతో పాటు 60 సర్కిళ్లు, 300 వార్డుల మ్యాపింగ్ను పూర్తి చేసి, గ్రేటర్ పరిధిలో జనన , మరణ సాఫ్ట్వేర్ అప్లికేషన్ను విజయవంతంగా ప్రారంభించారు.
ఈ సరికొత్త వ్యవస్థతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదు, జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనుంది. పౌరులు అందరూ తమ సమీప మీసేవా కేంద్రాల ద్వారా సులభంగా జనన, మరణ పత్రాల సేవలను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
