‘తీర మైదానాల’పై బిట్ బ్యాంక్

 ‘తీర మైదానాల’పై బిట్ బ్యాంక్
  • దేశంలో అత్యధిక తీర రేఖ ఉన్న ప్రాంతాలు అండమాన్​ నికోబార్​ దీవులు(1962కి.మీ.), గుజరాత్​(1054), ఆంధ్రప్రదేశ్​(974కి.మీ.)
  • పశ్చిమ తీర మైదానం ఉత్తరాన రాణా ఆఫ్​ కచ్​ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు 1840 కి.మీ. విస్తరించి ఉంది. 
  • పశ్చిమ తీరమైదానంలో ఉప్పునీటి కయ్యలు, వేలా తరంగా ప్రవేశ ద్వారాలు, నదీ ముఖద్వారాలు, బురద నేలలు, రాన్​ కనిపిస్తాయి. 
  • పశ్చిమతీర మైదానంలో వేలా తరంగాల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల తీర రేఖ క్రమక్షయం అధికంగా ఉంది.
  • అరేబియా సముద్రం క్రమంగా ఖండ భూభాగంలోకి చొచ్చుకుని వస్తుంది. దీని మూలంగా పశ్చిమతీర మైదానం సముద్ర ముంపునకు గురవుతూ క్రమంగా నిమజ్జిత తీరంగా మారిపోతుంది. 
  • పశ్చిమ తీర రేఖ సచ్ఛిద్రంగా రంపపు పండ్ల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. తీరరేఖ సమీపంలో తీరమైదానంపై భ్రంశాలు ఏర్పడి ఉన్నాయి. వీటి మూలంగా పశ్చిమ తీర మైదానం సహజ ఓడరేవులకు ప్రసిద్ధి చెందింది. 
  • పశ్చిమ తీర మైదానాన్ని గుజరాత్​, కొంకణ్​, కర్ణాటక, కేరళ మైదానం అని పిలుస్తారు.  
  • గుజరాత్​ మైదానం గుజరాత్​ నుంచి డామన్​ వరకు విస్తరించి ఉంది. కొంకణ్​ మైదానం డామన్​ నుంచి గోవా వరకు విస్తరించింది ఉంది. కర్ణాటక మైదానాన్ని కెనరా తీరం అని కూడా అంటారు. ఇది గోవా నుంచి కన్ననూర్​ వరకు విస్తరించి ఉంది. కేరళ మైదానం కన్ననూరు నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. 
  • తూర్పు తీర మైదానం దక్షిణాన కన్యాకుమారి నుంచి ఈశాన్యంగా సువర్ణరేఖ నది మీదుగా గంగానది ముఖద్వారం వరకు 1800కి.మీ. విస్తరించి ఉంది. 
  • పశ్చిమ తీర మైదానం కంటే తూర్పు తీరమైదానం వెడల్పుగా ఉంటుంది. 
  • తూర్పు తీర మైదానం విశాలమైన బీచ్​లతో నిర్మితమైంది. 
  • విరూపకారక బలాల వల్ల బంగాళాఖాతం ఖండ భూభాగం నుంచి క్రమంగా తిరోగమిస్తుంది.
  • తూర్పు తీరంలో హుగ్లీ నది ముఖద్వారం వద్ద  సముద్రంలోని ఖండ భాగాలు తిరోగమనం చెందడం వల్ల న్యూమూర్ దీవులు ఆవిర్భవించాయి. 
  • కృష్ణ, గోదావరి డెల్టా మధ్య ఉన్న కొల్లేరు సరస్సు పురాతన కాలంలో ఉప్పునీటి సరస్సు అని ఇటీవల పరిశోధనలో నిర్ధారించారు. 
  • కొల్లేరు సరస్సు ఒకప్పుడు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు, తర్వాత కాలంలో బంగాళాఖాతం క్రమంగా ఖండ భూభాగం నుంచి తిరోగమించడంతో కొల్లేరు సరస్సు ప్రస్తుతం తీరానికి దూరంగా ఖండ భూభాగంపై మంచినీటి సరస్సుగా ఆవిర్భవించింది. 
  • తూర్పు తీరంలో తీరరేఖ సూటిగా సన్నగా ఉండటంతో సహజ ఓడరేవులు తక్కువగా ఏర్పడ్డాయి. 
  • తూర్పు తీరమైదానాన్ని ప్రాంతీయంగా తమిళనాడు, ఆంధ్ర, ఉత్కళ, వంగ తీర మైదానాలుగా విభజించవచ్చు. 
  • తమిళనాడు మైదానాన్ని కోరమండల్​ తీరం అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో దీన్ని పేరు చోళ మండలం అని పిలిచేవారు. ఇది కన్యాకుమారి నుంచి పులికాట్​ సరస్సు వరకు వ్యాపించి ఉంది. 
  • ఆంధ్ర మైదానాన్ని కోస్తా తీరం/ సర్కార్​ తీరం అంటారు. ఇది పులికాట్​ సరస్సు నుంచి బరంపురం (ఒడిశా రాష్ట్రం) వరకు విస్తరించి ఉంది.
  • ఉత్కళ మైదానం బరంపురం నుంచి సుందర్​బన్స్​ వరకు విస్తరించి ఉంది. దీనిని కాంతి తీర మైదానం అంటారు.