కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ కార్యకర్త శకుంతల నటరాజ్ను హైగ్రౌండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటుచేసుకుంది.
ఎందుకు అరెస్ట్ చేశారంటే..?
కొద్దిరోజుల క్రితం ఉడిపిలోని ఓ కాలేజీలో విద్యార్థిని రెస్ట్రూమ్ వీడియో బయటకొచ్చింది. ఒక వర్గానికి ముగ్గురు విద్యార్థినులు వేరొక వర్గానికి చెందిన విద్యార్థిని రెస్ట్రూములో ఉండగా రహస్యంగా చిత్రీకరించి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ముగ్గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు స్పందిస్తూ గతంలో ఇలాంటివి జరగలేదా? ఆరోజు ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపీ కార్యకర్త శకుంతల నటరాజ్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమెపై కాంగ్రెస్ కార్యకర్త హనుమంతరాయ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ಮುಸ್ಲಿಂ ಯುವತಿಯರು ಟಾಯ್ಲೆಟ್ ನಲ್ಲಿ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಟು ಹಿಂದೂ ಹೆಣ್ಣುಮಕ್ಕಳ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದು ಕಾಂಗ್ರೆಸ್ನವರ ಪ್ರಕಾರ ಮಕ್ಕಳಾಟವಂತೆ..@siddaramaiah ನವರ ಸೊಸೆ or ಹೆಂಡ್ತಿ ಅವ್ರ ವಿಡಿಯೋವನ್ನು ಇದೆ ತರ ಮಾಡಿದ್ರೆ
— ಶಕುಂತಲ?Shakunthala (@ShakunthalaHS) July 25, 2023
ಅದನ್ನು ಮಕ್ಕಳಾಟ ಅಂತ ಒಪ್ಕೋತೀರಾ? pic.twitter.com/jP0QTKvL5R