ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి

ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉద్రికత్త నెలకొంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో బీజేపీ కార్యకర్తలు దాడిచేశారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని..రాముడి పవిత్రతను అపవిత్రం చేస్తోందని ధర్మారెడ్డి ఆరోపించారు. దేవుని పేరుతో అకౌంట్ బులిటి లేకుండా బీజేపీ నేతలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. రామమందిరం పేరుతో వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలన్నారు. ధర్మారెడ్డిపై వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు..ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వేల కోట్ల వసూళ్లు ఎందుకని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దేవుడి పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయో లెక్కలు చెప్పాలంటూ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.