
నిజామాబాద్, వెలుగు : ఆపరేషన్సిందూర్ తో పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైనికుల ధైర్యాన్ని కీర్తిస్తూ సోమవారం నగరంలో తిరంగా ర్యాలీ జరిగింది. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో బీజేపీ సహా యువజన సంఘాలు, పౌరులు పొల్గొన్నారు. ఆర్ఆర్చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు కొనసాగిన ర్యాలీలో జాతీయ జెండాను పట్టుకొని భారత్మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. యాభై అడుగుల జాతీయ జెండా, భారతమాత వేషధారణలో బాలికలు ర్యాలీలో పాల్గొన్నారు. సైనికులను స్మరిస్తూ చేసిన కోలాటం ఆకర్షణగా నిలిచింది.
పాక్ మూలాలున్న వారిపై నిఘా..
పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులపై నిఘా పెట్టి, వారి కదలికలను గమనించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గాంధీచౌక్ వద్ద ఆయన ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. పాక్తో సంబంధాలున్న వ్యక్తులు నగరం, దేశం వీడివెళ్లిపోవాలన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ కృపాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. .
కామారెడ్డిలో...
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు . ఇటీవల ఆపరేషన్ సిందూర్లో సైనికులు చూపిన వీరత్వం, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ త్రివర్ణ పతాకాలతో యాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ నుంచి మొదలైన యాత్ర జేపీఎన్ చౌరస్తా, సుభాష్రోడ్డు, స్టేషన్ రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, హైస్కూల్ రోడ్డు మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది.
యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు, స్టేట్ లీడర్ మురళీధర్గౌడ్, పార్టీ లీడర్లు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్, వీహెచ్పీతో పాటు ఆయా వర్గాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.