బీజేపీలో క్లస్టర్​ ఇన్​చార్జులు

బీజేపీలో క్లస్టర్​ ఇన్​చార్జులు

హైదరాబాద్, వెలుగు:  మున్సిపల్  ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు వేగిరం చేసిన బీజేపీ.. మున్సిపాలిటీలకు క్లస్టర్​ ఇన్​చార్జులను నియమించింది. ఒక్కో లోక్​సభ నియోజకవర్గాన్ని ఒక్కో క్లస్టర్​గా గుర్తించి, దాని పరిధిలోని మున్సిపాలిటీలన్నింటినీ కొందరు ఇన్​చార్జులకు అప్పగించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి శనివారం ఈ జాబితాను మీడియాకు విడుదల చేశారు. మున్సిపల్​ ఎలక్షన్ల ప్రచారం, గెలుపు బాధ్యతలను ఆ క్లస్టర్​ ఇన్​చార్జులే పర్యవేక్షించనున్నారు.

  •  పెద్దపల్లి లోక్​సభ పరిధిలో 11 మున్సిపాలిటీలు ఉండగా ఏడుగురు క్లస్టర్​ ఇన్​చార్జులను పార్టీ నియమించింది. మాజీ ఎంపీ వివేక్      వెంకటస్వామితో పాటు మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, సోమారపు సత్యనారాయణ, బోడ జనార్దన్, ఎస్.కుమార్, ప్రదీప్ కుమార్,  బల్మూరి వనిత ఈ జాబితాలో ఉన్నారు.
  •     నల్గొండ లోక్​సభ పరిధిలోని 9 మున్సిపాలిటీల్లో ఎంపీ గరికపాటి మోహన్ రావు, మరో ఐదుగురిని ఇన్​చార్జులుగా నియమించారు.
  •     భువనగిరి పరిధిలోని 14 మున్సిపాలిటీలకు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మరో ఐదుగురు ఇన్​చార్జులుగా ఉంటారు.
  •     ఖమ్మం పరిధిలో 3 మున్సిపాలిటీలు ఉండగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మరో నలుగురికి అప్పగించారు.
  •     వరంగల్  పరిధిలోని ఐదు మున్సిపాలిటీలకు మాజీ మంత్రి విజయరామారావు, ఇంకో ఐదుగురు నేతలు ఉంటారు.
  •     చేవెళ్లలోని 13 మున్సిపాలిటీలకు గాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మరో ముగ్గురు ఉంటారు.
  •     సికింద్రాబాద్‌లోని 13 మున్సిపాలిటీలను దత్తాత్రేయ, మరో ఐదుగురు పర్యవేక్షిస్తారు.
  •     మెదక్ పరిధిలోని 12 మున్సిపాలిటీలకు మాజీ ఎంపీ చాడ సురేశ్​రెడ్డి, ఇంకో మరో ముగ్గురిని నియమించారు.
  •     జహీరాబాద్లోని 6 మున్సిపాలిటీలకు ఇంద్రసేనారెడ్డి, మరో నలుగురిని నియమించారు.
  •     కరీంనగర్ పరిధిలోని 8 మున్సిపాలిటీలకు ఎంపీ బండి సంజయ్, ఇంకో ముగ్గురు..
  •     నిజామాబాద్ పరిధిలో 7 మున్సిపాలిటీలకు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఇంకో నలుగురు..
  •     ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా ఎంపీ సోయం బాపురావు, మరో ఇద్దరు..
  •     మహబూబాబాద్ లో 6 మున్సిపాలిటీలకు పేరాల శేఖర్ రావు, ఇంకో ముగ్గురు..
  •     మహబూబ్ నగర్ పరిధిలోని 11 మున్సిపాలిటీలకు డీకే అరుణ, మరో ఐదుగురు..
  •     నాగర్ కర్నూల్ ఎంపీ పరిధిలో 10 మున్సిపాలిటీలు ఉండగా ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మరో ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.