చెక్కి క్యాంప్​లో ఇంటింటికి బీజేపీ ప్రచారం

చెక్కి క్యాంప్​లో  ఇంటింటికి బీజేపీ ప్రచారం

బోధన్, వెలుగు: బోధన్​లోని చెక్కిక్యాంప్​ లో ఇంటింటికి బీజేపీ ప్రచారం నిర్వహించారు.  గ్రామస్తులు ముక్ముమ్మడిగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు మేడపాటి ప్రకాశ్​రెడ్డి మాట్లాడుతూ చెక్కిక్యాంప్​లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. 

రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, అనేక మంది అర్హులకు పింఛన్లు అందడం లేదన్నారు.కార్యక్రమంలో బోధన్ ​పట్టణాధ్యక్షుడు కొలిపాక బాలరాజ్, ప్రధాన కార్యదర్శులు వాసు, సందీప్, ప్రవీణ్, శివరాజ్, బీసీ మోర్చా పట్టణా అధ్యక్షుడు గుంత గంగాధర్, ఎస్సీ మోర్చా పట్టణాధ్యక్షుడు కృష్ణ పాల్గొన్నారు.