- మేధావులు, విద్యావంతులు మేల్కొవాలె
- టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్
నిజామాబాద్, వెలుగు: రాజ్యాంగ్యాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపేసేందుకు పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు.
విద్యావంతులు, మేధావులు బలంగా తిప్పికొట్టాలని సూచించారు. బుధవారం రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ సిటీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
లౌకికవాదం, స్వేచ్ఛ, సమానత్వ ప్రజాస్వామ్య పునాదిగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందని, దీన్ని రచించిన అంబేద్కర్ ప్రపంచ గుర్తింపు పొందిన మేధావి కొనియాడారు. యువత రాజ్యాంగాన్ని చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు నీలకంఠేశ్వర్ఆలయంలో పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన వెంట వ్యవసాయ కమిషన్సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు ఉన్నారు.
