
కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే రసమయిని ప్రశ్నిస్తూ గన్నేరువరం మండలంలోని పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ మండల శాఖ.
"ఎమ్మెల్యే రసమయి గారు డబుల్ రోడ్డు పనులు పూర్తి అయ్యేదెన్నడు?.. గన్నేరువరం బీజేపీ మండల శాఖ పాదయాత్ర మరియ యువకుల పోరాటంతో దిగివచ్చి ప్రభుత్వం ఇచ్చిన 71 కోట్ల నిధుల GO ఉత్తదేనా?.. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం ఎప్పుడు చేపడతారు?..గుండ్లపల్లి కొండాపూర్ ప్రజలు దుమ్ముతో అవస్థలు పడాల్సిందేనా?.. ఎమ్మెల్యే రసమయి గారు ఇదేనా మీరు చేసే అభివృద్ది?.. మండల ప్రజల కష్టాలు తీరేదెన్నడు?" అని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు బీజేపీ నేతలు.