డబుల్​బెడ్​ రూమ్ ఇండ్లు అలాట్ చేయాలి : దినేశ్​​

డబుల్​బెడ్​ రూమ్ ఇండ్లు అలాట్ చేయాలి : దినేశ్​​
  • ఆగస్టు 15న పేదలతో గృహ ప్రవేశం చేయిస్తాం
  • బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​​  

నిజామాబాద్​, వెలుగు: నగరంలోని కొత్త కలెక్టరేట్​ సమీపంలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను కాంగ్రెస్​ సర్కార్ అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​​కులాచారి డిమాండ్​ చేశారు. లేని పక్షంలో ఆగస్టు 15న పేదలను తాము వెంటబెట్టుకొచ్చి గృహప్రవేశం చేయిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన డబుల్​ బెడ్ రూమ్ ఇండ్లు విజిట్​ చేసి మీడియాతో మాట్లాడారు. పదేండ్లుగా ఇండ్లను చూపుతూ పేదలను ఆశల్లో ముంచెత్తుతున్నారని కేటాయింపులు మాత్రం చేయలేదన్నారు. 

బీఆర్​ఎస్​ తరహాలోనే కాంగ్రెస్​ కూడా వ్యవహరిస్తుందన్నారు. సర్కార్​ నుంచి ఇండ్లు పొందడం పేద కుటుంబాల హక్కని ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. ఇప్పటికే శిథిల స్థితికి చేరిన ఇండ్ల అలాట్​మెంట్ పూర్తి చేయాలని, గడువు దాటాక తమ పార్టీ ప్రవేశించి ఆ పని పూర్తి చేస్తుందన్నారు. జిల్లా సెక్రటరీ పోతంకర్​ లక్ష్మీనారాయణ, రూరల్​ కన్వీనర్​ పద్మారెడ్డి, జగన్​రెడ్డి, శంకర్​రెడ్డి, మాస్టర్​ శంకర్​, ఆనంద్​, నరేశ్​ తదితరులు ఉన్నారు.