
- ఆగస్టు 15న పేదలతో గృహ ప్రవేశం చేయిస్తాం
- బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్
నిజామాబాద్, వెలుగు: నగరంలోని కొత్త కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ సర్కార్ అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆగస్టు 15న పేదలను తాము వెంటబెట్టుకొచ్చి గృహప్రవేశం చేయిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు విజిట్ చేసి మీడియాతో మాట్లాడారు. పదేండ్లుగా ఇండ్లను చూపుతూ పేదలను ఆశల్లో ముంచెత్తుతున్నారని కేటాయింపులు మాత్రం చేయలేదన్నారు.
బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తుందన్నారు. సర్కార్ నుంచి ఇండ్లు పొందడం పేద కుటుంబాల హక్కని ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. ఇప్పటికే శిథిల స్థితికి చేరిన ఇండ్ల అలాట్మెంట్ పూర్తి చేయాలని, గడువు దాటాక తమ పార్టీ ప్రవేశించి ఆ పని పూర్తి చేస్తుందన్నారు. జిల్లా సెక్రటరీ పోతంకర్ లక్ష్మీనారాయణ, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జగన్రెడ్డి, శంకర్రెడ్డి, మాస్టర్ శంకర్, ఆనంద్, నరేశ్ తదితరులు ఉన్నారు.