లోక్ సభ సెగ్మెంట్లకు బీజేపీ ప్రభారీలు

లోక్ సభ సెగ్మెంట్లకు బీజేపీ ప్రభారీలు
  •  మరో నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా కమల దళం లోక్ సభ ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 12 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ.. ఇటీవల పార్టీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్ర శేఖర్ తివారీని నియమించింది. తాజాగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ప్రభారీలను, మరో నాలుగు జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను ఎంపిక చేసింది. ఆదిలాబాద్​కు పతంగ్​ బ్రహ్మానంద్​, నారాయణపేట్​ కు పగడాకుల శ్రీనివాస్​, భూపాలపల్లికి నిశిధర్​ రెడ్డి, మహబూబాబాద్​ జిల్లాకు యలమంచిలి వెంకటేశ్వర్​  రావులను పార్టీ అధిష్టానం నియమించింది.