పన్నెండేళ్ల పిల్లోడికి కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం

పన్నెండేళ్ల పిల్లోడికి కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం

పన్నెండేళ్ల అబ్బాయికి కూడా సభ్యత్వం ఇచ్చిన టీఆర్ఎస్ నేతలు.. బీజేపీ సభ్యత్వాలపై కామెంట్ చేయడం హాస్యాస్పదమన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ సభ్యత్వంపై.. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ మాటలు దొంగే దొంగ దొంగ అని అన్నట్లు ఉంది. ఇప్పటికే బీజేపీలో 30 లక్షల మంది చేరారన్నారు. టీఆర్ఎస్ విధానాలు నచ్చకే.. తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అవినీతిపరుడైన చిదంబరాన్ని.. కాంగ్రెస్ నేతలు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు లక్ష్మణ్.