రేప్ అయిన బాధితురాలి మెడికల్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు

 రేప్ అయిన బాధితురాలి మెడికల్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు

హుజుర్ నగర్ నియోజకవర్గంలో తండా నుండి హైదరాబాద్ కు వచ్చిన అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి. నిందితుడు ఎవరో తెలిసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా TRS ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప సమస్యలు పట్టవా అన్నారు.

రాష్ట్రంలో మహిళలు ఎక్కడ సురక్షితంగా లేరని..దేశంలో మహిళల మీద దాడుల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించిన ఆమె.. కూతురు తప్ప రాష్ట్రంలో కేసీఆర్ కు మహిళలు గుర్తుకురారా అన్నారు. మీ కూతురికి పదవులు ఇస్తున్నారని..మరి రాష్ట్రంలో ఉన్న మహిళలకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ లా అండ్ ఆర్డర్ గూరించి మాట్లాడుతున్నారని…మరి మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఎందుకు స్పందించరన్నారు.

రేప్ అయిన బాధితురాలి మెడికల్ రిపోర్ట్ వివరాలను తెలిపారు బంగారు శృతి. లైంగిక దాడి, షుగర్ లెవెల్స్ పెరిగి హాస్పిటల్ లో చేరినట్లు మమత హాస్పిటల్ కన్ఫామ్ చేసిందన్నారు.  మర్మాంగంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్ తెలిపిందన్నారు. బలవంతంగా లైంగికదాడి జరిగినట్టు మెడికల్ రిపోర్ట్ లో తెలిందని.. పోస్టుమార్టం రిపోర్ట్ ను పోలీసులు కావాలనే బయటపెట్టలేదన్నారు బంగారు శృతి.