
- అక్కడే నిమజ్జనాలు చేస్తాం బీజేపీ నేత మాధవీలత
ఖైరతాబాద్, వెలుగు: హుస్సేన్సాగర్లో గణేశ్నిమజ్జనంతో ఏ సమస్యా ఉండదని బీజేపీ లీడర్, భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి మెంబర్మాధవీలత అన్నారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘హుస్సేన్సాగర్లో డ్రైనేజీల ద్వారా కలుస్తున్న మల, మూత్ర విసర్జనను ముందు ఆపండి. ఆ కంపు భరించలేకున్నాం. ఎప్పటిలాగే హిందూ సంప్రదాయం ప్రకారం భక్తులు వినాయకుడిని హుస్సేన్సాగర్లోనే నిమజ్జనం చేస్తారు. దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. లేకుంటే ప్రత్యామ్నాయ స్థలం చూపండి.
ఆంక్షలు అంటూ అడ్డుకుంటే విగ్రహాలు మండపాల వద్దే ఉంటాయి. అక్కడే కొత్తగా వెలసిన దేవాలయాలుగా పూజలు చేస్తాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భాగ్యనగర్గణేశ్ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్రెడ్డి మాట్లాడుతూ రెండేండ్లుగా ప్రభుత్వం హైకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ నిమజ్జనానికి చర్యలు తీసుకుంటోందన్నారు.
హైకోర్టు ఉత్తర్వులపై అనేక వదంతులు వస్తున్నాయని, 2021 హైకోర్టు ఆదేశాల ప్రకారం పీఓపీ(ప్లాస్టర్ఆఫ్ప్యారిస్) విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. కాలుష్యకారకులకు తాము కూడా వ్యతిరేకమేనని చెప్పారు.
అయితే మార్పునకు కొంత సమయం పడుతుందన్నారు. ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్రోడ్లో నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 2022, 2023లో మాదిరిగా గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.