నిర్మల్, వెలుగు: హిందూ ఆలయాల్లో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జ్రావుల రామనాథ్ డిమాండ్ చేశారు. చోరీ జరిగిన నిర్మల్జిల్లా కేంద్రంలోని మల్లన్న గుట్టపై గల హరిహర క్షేత్రాన్ని సోమవారం సందర్శించారు.
చోరీ వివరాలను ఆలయ పూజారులను అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా హిందూ ఆలయాలే టార్గెట్ గా చోరీలు జరుగుతున్నప్పటికీ దొంగలను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆలయాల వద్ద నిఘాను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
