తడిసిన వడ్లు కొనకపోతే ఆందోళన.. : దినేశ్​కులాచారి

తడిసిన వడ్లు కొనకపోతే ఆందోళన.. : దినేశ్​కులాచారి
  • కలెక్టర్​తో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేశ్​​ 

నిజామాబాద్​, వెలుగు : ఇటీవలి వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనిచో బాధిత రైతుల పక్షాన ఆందోళన చేపడతామని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​కులాచారి తెలిపారు. సోమవారం ఆయన రైతులతో కలిసి కలెక్టర్ రాజీవ్​గాంధీని కలెక్టరేట్​లో కలిశారు.  

ఇప్పటికి 8.60 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారని, ఇంకా 3 లక్షల టన్నుల ధాన్యం అన్నదాతల వద్ద ఉందన్నారు.  అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ స్టేట్​గవర్నమెంట్​కు రైతులపై లేదని విమర్శించారు. నాయకులు నూతుల శ్రీనివాస్​రెడ్డి, పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ. పద్మారెడ్డి, హరీశ్​రెడ్డి, శంకర్​రెడ్డి, నాయుడి రాజన్న, జనార్ధన్​రెడ్డి పాల్గొన్నారు.