ఈటల, బండి సంజయ్ మీటింగ్‌లో కరెంట్ కట్.. ప్రభుత్వంపై మండిపడ్డ నేతలు

ఈటల, బండి సంజయ్ మీటింగ్‌లో కరెంట్ కట్.. ప్రభుత్వంపై మండిపడ్డ నేతలు

భయపడి పిరికిపందల్లా తమ మీటింగుల్లో పవర్ కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అధికారులు తీరు మార్చుకోకుంటే జనమే తరిమికొడుతారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట శంకర్ నందన్ గార్డెన్లో బీజేపీ మీటింగ్ జరుగుతుండగా కరెంట్ కట్ అయ్యింది. బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేశారు సిబ్బంది. దీంతో ఫంక్షన్ హాల్ బయట సమావేశం పెట్టుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్. కరెంట్ కట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల. ఇలాంటి కుట్రలకు 30న ప్రజలు కర్రు కాల్చి వాతపెడుతారన్నారు. కేసీఆర్ దొరతనాన్ని, బానిస పద్ధతిని చీల్చి చెండాడుతారన్నారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. కరెంట్ కట్ చేశారంటేనే టీఆర్ఎస్ గెలవదని అర్థమవుతోదన్నారు. ‘‘కరెంట్ పోయినా.. మీరు  ఎవరూ కదలకుండా ఉన్నారంటే ఇదీ ప్రేమంటే.. ఈటల రాజేందర్ గెలిచాక.. సీఎం కరెంట్ కట్ అవుతుంది. బరితెగింపు రాజకీయాలు టీఆర్ఎస్ చేస్తోంది. మనం బరిగీసి కొట్లాడాలి. ఈటల రాజేందర్ కల్మషం లేని మనిషి.. అలాంటోనికి మోసం చేస్తే పాపం తగులుతుంది. ఇది బలిసినోడికి, పేదోళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నిక. గడీల పాలనకు, గరీబోళ్లకు మధ్య జరుగుతున్న పోరాటం. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ గల్లంతైతే.. గడీలు బద్ధలవుతాయి. టీఆర్ఎస్ పాలన అంతమవుతుంది’’ అని బండి సంజయ్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఓడినా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థుల తల్లులకు తులాభారం

మరోసారి పేరు మార్చుకున్న సమంత