కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజల కలలు కల్లలు అయ్యాయి

కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజల కలలు కల్లలు అయ్యాయి

తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయనుకున్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్న ప్రజలు కలలు కంటే..అవి కల్లలు అయ్యాయని చెప్పారు. సూర్యాపేటలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 12వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని మండిపడ్డారు. బండి సంజయ్ న్యాయకత్వంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని తెలిపారు. మోడీ సభతో కేసీఆర్ ఆగమాగమై వారం తర్వాత బయటకు వచ్చారని విమర్శించారు. బీజేపీ దెబ్బకు క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటున్నాడని..క్లౌడ్ బరస్ట్ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.