కాంగ్రెస్​లో చేరిన రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్​లో చేరిన రాజగోపాల్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే..  రాజగోపాల్ రెడ్డి, ఇతర నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శుక్రవారం ఉదయం ఏఐసీసీ చీఫ్ ఖర్గేను రాజ్ గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ త్వరలో  రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది.  ఈ ముగ్గురు నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించాలనే ఉద్దేశంతోనే గురువారం వీరి చేరిక అనివార్యమైనట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రిలీజ్ కాబోయే లిస్ట్ లో వీరి పేర్లు ఉంటాయని సమాచారం.