ఎమ్మెల్యే మైనంపల్లిపై బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే మైనంపల్లిపై బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులు తనను వెంబడించి.. హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశారని బీజేపీ నేత ముక్కెర తిరుపతిరెడ్డి చెప్పారు. గత రెండు నెలల నుంచి తన భూమిని అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, సంతకాలు తీసుకోవాలని వెంబడిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

మైనంపల్లి అనుచరుల భయానికే తాను విజయవాడకు, అక్కడి నుంచి విశాఖకు వెళ్లానని చెప్పారు. మైనంపల్లి అనచరులు తన భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మైనంపల్లి తనకు 8 సార్లు ఫోన్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడం వల్లే తాను ఆటోలో వెళ్లాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకు తాను డీసీపీ ఆఫీసుకు వచ్చానని చెప్పారు.