బీజేపీ నేతతో పాటు నలుగురి కాల్చివేత

బీజేపీ నేతతో పాటు నలుగురి కాల్చివేత

మహారాష్ట్రలోని జల్ గావ్ ప్రాంతంలో బీజేపీ నేతను, అతని నలుగురు కుటుంబ సభ్యులను తుపాకులతో వచ్చిన ముగ్గురు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. స్థానిక కార్పొరేటర్ రవీంద్ర ఖారత్ (55), ఆయన కుటుంబ సభ్యుల్లోని నలుగురిని దుండగులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు రవీంద్ర ఖారత్ ఇంట్లోకి ప్రవేశించి, అతనితో పాటు, అతని సోదరుడు సునీర్ ఖారత్, కుమారులు రోహిత్, ప్రేమ్ సాగర్, దగ్గరి బంధువు సుమిత్ లను కాల్చి చంపారని స్థానిక ఎస్పీ చెప్పారు. ఈ ఘటన భూసావల్ ప్రాంతంలోని ఖారత్ ఇంట్లోనే జరిగిందన్నారు. కాల్పుల తర్వాత ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయని, వారిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, సాక్ష్యాధారాలను సేకరించింది. వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.