తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశాడు

తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశాడు

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం కేబినెట్ మంత్రి పదవిని త్యాగం చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద వారి చిత్రపటానికి వివేక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ సాధనకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు అనేక సేవలందించి.. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వీరుడు కొండా బాపూజీ అని వివేక్ అన్నారు. యువత మొత్తం కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు.

For More News..

అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు