ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణకు ఓనర్లే: వివేక్ వెంకటస్వామి

ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణకు ఓనర్లే: వివేక్ వెంకటస్వామి

ఆర్టీసీ  కార్మికులు కూడా తెలంగాణకు ఓనర్లేనన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో అప్పటి ప్రభుత్వాలను ఎదిరించి కార్మికులు పోరాడారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అందర్ని వాడుకుని.. ఇప్పుడు మరిచిపోయారని ఆరోపించారు. తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చేతుల్లోకి వెళ్లిందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాల గూడ టూర్ లో ఉన్న ఆయన.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. RTC ని ప్రయివేటు పరం చేస్తాననడం కేసీఆర్ నీరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. ఆర్టీసీని ఆంధ్ర ప్రాంత ప్రయివేటు ట్రావెల్స్ కి అప్పజెప్పాలని సీఎం చూస్తున్నారని, ఒకప్పుడు కార్మికుల మంత్రి గా పనిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ..ఇలా కార్మికుల సమ్మెను అణచివేయడం దారుణమన్నారు. చట్టబద్ధంగా 35 రోజుల ముందు సమ్మెకు పిలుపు నిచ్చిన RTC కార్మికులను పిలిచి మాట్లాడేది పోయి ముఖ్యమంత్రి తుగ్లక్ లా వ్యవరిస్తున్నారని ఆయన అన్నారు. RTC కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.