డబ్బు పంచకుండా గెలవగలవా? సీఎం కేసీఆర్‌కు వివేక్ సవాల్

డబ్బు పంచకుండా గెలవగలవా? సీఎం కేసీఆర్‌కు వివేక్ సవాల్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు బీజేపీ కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ వివేక్‌‌‌‌ సవాల్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే  దుబ్బాక బై ఎలక్షన్స్​లో డబ్బులు పంచకుండా గెలవగలమని స్టేట్‌‌‌‌మెంట్ ఇవ్వాలని  బీజేపీ కోర్‌‌‌‌‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌‌‌‌వెంకటస్వామి సవాల్​ విసిరారు. ఏ ఎన్నికల్లోనైనా టీఆర్​ఎస్​ కేవలం డబ్బులు పంచి మాత్రమే గెలవగలదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ పోలీసులతో కేసీఆర్ డబ్బులు పంపిణీ చేయించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఒక్కో టీఆర్​ఎస్​ క్యాండిడేట్​తో రూ.20 కోట్లు పంపిణీ చేయించారని ఆరోపించారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న కమీషన్ డబ్బులేనన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన చేశారు.

భయపెట్టి గెలవాలని చూస్తున్నరు

దుబ్బాక  బీజేపీ క్యాండిడేట్ రఘునందన్‌‌‌‌రావుపై పోలీసుల తీరును  వివేక్​వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. రాత్రి పూట బీజేపీ లీడర్ కారు ఆపి చెకింగ్ పేరుతో 9 గంటల పాటు వెయిట్ చేయించడం ఏంటని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రఘునందన్​ మీద తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, పోలీసులతో భయపెట్టి గెలవాలని చూస్తున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ మీద  కేంద్రం కన్నేసి ఉంచిందని,  తుగ్లక్ తరహా పాలనాతీరును గమనిస్తోందన్నారు. సరైన సమయంలో కేసీఆర్​కు  గుణపాఠం తప్పదని హెచ్చరించారు.  భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఒక్కో ఫ్యామిలీకి రూ.30 వేలు ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ఇవ్వాలని వివేక్ డిమాండ్ చేశారు.

For More News..

ఒక్కో ఫ్యామిలీకి లక్షన్నర లాస్