అక్రమ కేసులతో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకట స్వామి అన్నారు. మల్లన్న అరెస్ట్ను ఖండిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులను వివేక్ పరామర్శించారు. పీర్జదిగూడాలోని తీన్మార్ మల్లన్న ఇంటికివెళ్లి మల్లన్న కుటుంబ సభ్యులను కలిసిన వివేక్.. మల్లన్న విషయంలో వారికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తుండు. అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నని జైళ్లో వేశారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను, కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయట పెట్టినందుకు క్యూ న్యూస్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే రోజులు దగ్గరపడ్డాయి’ అని వివేక్ అన్నారు.
పీర్జదిగూడాలోని తీన్మార్ మల్లన్న ఇంటికివెళ్లి మల్లన్న కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికి మల్లన్న విషయంలో అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. @TeenmarMallanna pic.twitter.com/CUN3CQ2G2L
— Dr Vivek Venkatswamy (@vivekvenkatswam) September 7, 2021