మునుగోడు ప్రజలు బీజేపీ వైపే ఉన్నరు

మునుగోడు ప్రజలు బీజేపీ వైపే ఉన్నరు

సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాంలు చేస్తూ అవినీతికి పాల్పడుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. లిక్కర్ స్కాంలో తమ కుటుంబసభ్యుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు.. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ప్రజలు బీజేపీవైపే ఉన్నారని వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందనడానికి వికారాబాద్ సభలో జనాలు లేక కుర్చీలు ఖాళీగా ఉండడమే నిదర్శనమన్నారు. 

రామగుండంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఆర్ఎఫ్సీఐ (RFCI)లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులిచ్చిన వారికే కొలువులు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని మరోసారి యూనియన్ ఫర్టిలైజర్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివేక్ వెంకటస్వామి చెప్పారు.