శంషాబాద్ ఎయిర్ పోర్టులో బండి సంజయ్ కు ఘన స్వాగతం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బండి సంజయ్ కు ఘన స్వాగతం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం (ఆగస్టు 4న) ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బండి సంజయ్ కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలు, పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ కాబోయే సీఎం బండి సంజయ్ అంటూ కార్యకర్తల నినాదాలు చేయడంతో వారిని వారించారు బండి సంజయ్. 

అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి సిద్ధాంతి బస్తీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ గజమాలతో బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ సన్మానించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు బండి సంజయ్.