రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే హత్యలు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే హత్యలు

సరూర్ నగర్ నాగరాజు హత్యపై ప్రభుత్వం స్పందించడంలేదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ఈ రోజు రాజ్ భవన్ లో వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో బీజేపీ నేతలు గవర్నర్ తో సమావేశమయ్యారు. సరూర్ నగర్ హత్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇప్పటి వరకు బాధితులకు అండగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే హత్యలు జరుగుతున్నాయన్నారు వివేక్ వెంకటస్వామి. హత్య కేసుపై విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్