
కొమురవెల్లి, వెలుగు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొమురవెల్లి మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ లో బీజేపీ జిల్లా, మండల నాయకులు కలిసి కొమురవెల్లి మల్లికార్జునస్వామి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ను దసరా లోపు ప్రారంభిస్తామని ప్రకటించారు.