- ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద బీజేపీ నేతల ఆందోళన
- ఉదయనిధి దిష్టిబొమ్మ దహనం
బషీర్బాగ్, వెలుగు: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం వద్ద బీజేపీ నేతలు గురువారం ఆందోళన చేపట్టారు. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ నుంచి ర్యాలీగా వెళ్లి బడా గణేశ్ విగ్రహం ముందు ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్దన్, స్పోక్స్ పర్సన్ సుభాష్తో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి ఖైరతాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సెక్యులర్ వాదనల పేరుతో హిందూ ధర్మంపై దాడులు చేస్తే గుణపాఠం తప్పదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.